TG : మాగంటి గోపీనాథ్ చికిత్సను పర్యవేక్షిస్తున్న కేటీఆర్ సతీమణి శైలిమ

ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ధైర్యంగా కేటీఆర్ కుటుంబసభ్యులు ఆసుపత్రిలో ఉంటూ వైద్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్ కు బయలుదేరినప్పటికీ రావడానికి సమయం పట్టడంతో కేటీఆర్ సతీమణి శైలిమ ఆసుపత్రికి వెళ్లి మాగంటికి కుటుంబసభ్యులకు చేదోడుగా ఉన్నారు. శుక్రవారం నుంచి శైలిమ ఆసుపత్రిలోనే ఉంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ శుక్రవారం తీవ్రమైన గుండెనొప్పితో ఏఐజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాగంటి వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాగంటి ఆరోగ్య పరిస్థితని, అందుతున్న చికిత్సను ఎప్పటికప్పుడు కేటీఆర్ కు శైలిమ తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com