Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాంలంది హైకోర్టు.. రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు కావాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. రిజర్వేషన్లు పూర్తయ్యాక 60 రోజుల సమయం కావాలంది ఎన్నికల సంఘం.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ టి.మాధవిదేవి ఇవాళ తీర్పు ఇచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com