LOCAL WAR: మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

LOCAL WAR: మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
X
స్థానిక సమరానికి రంగం సిద్ధం... షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..  డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు

తె­లం­గా­ణ­లో పం­చా­య­తీ రాజ్ సం­స్థల ఎన్ని­క­లు డి­సెం­బ­ర్ 11, 14, 17 తే­దీ­ల్లో మూడు దశ­లు­గా జరి­గే అవ­కా­శం ఉంది. నో­టి­ఫి­కే­ష­న్ ఈ నెలా 26 లేదా 27న ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. పం­చా­య­తీ­ల­కు ఆర్థిక సంఘం ని­ధు­లు ఫ్రీ­జ్ కా­వ­డం­తో ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల్సి ఉంది. బీసీ రి­జ­ర్వే­ష­న్ల వి­వా­దం కా­ర­ణం ఇప్ప­టి వరకూ ఆల­స్యం అవు­తూ వస్తు­న్నా­యి. మొ­ద­టి దశ (డి­సెం­బ­ర్ 11)లో 4,000కు పైగా గ్రామ పం­చా­య­తీ­లు, 100 MPTC­లు కవర్ అవు­తా­యి. రెం­డవ దశ (డి­సెం­బ­ర్ 14)లో మరో 4,000 పం­చా­య­తీ­లు, మూడవ దశ (డి­సెం­బ­ర్ 17)లో మి­గి­లిన 4,769 పం­చా­య­తీల ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చే అవ­కా­శం ఉంది. మొ­త్తం­గా 12,769 గ్రామ పం­చా­య­తీ­ల­కు ఎన్ని­క­లు జర­గ­ను­న్నా­యి. ఈ ఎన్ని­క­ల­కు 1.67 కో­ట్ల మంది ఓట­ర్లు అర్హు­లు, 1 లక్ష­కు పైగా అభ్య­ర్థు­లు పోటీ పడ­వ­చ్చ­ని అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. తె­లం­గా­ణ­లో పం­చా­య­తీ ఎన్ని­క­లు 2020 అక్టో­బ­ర్‌­లో జర­గా­ల్సి­న­ప్ప­టి­కీ, BC రి­జ­ర్వే­ష­న్ వి­వా­దా­లోత ఆల­స్య­మ­య్యా­యి. ఆర్టి­క­ల్ 243E ప్ర­కా­రం ప్ర­తి 5 సం­వ­త్స­రా­ల­కు ఎన్ని­క­లు జర­పా­ల్సి­న­ప్ప­టి­కీ బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు ఇచ్చి మా­త్ర­మే ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­మ­ని ప్ర­భు­త్వం పట్టు­దల చూ­పిం­ది. అయి­తే హై­కో­ర్టు జూన్ 2025లో "సె­ప్టెం­బ­ర్ 30 వరకు పూ­ర్తి చే­యా­లి" అని ఆదే­శిం­చిం­ది. అయి­తే, BC కమి­ష­న్ ని­వే­ది­క­లు, 42% BC కోటా వి­వా­దా­లు, సె­ప్టెం­బ­ర్ 2025లో ప్ర­క­టిం­చిన పాత షె­డ్యూ­ల్ పై హై­కో­ర్టు స్టే ఇచ్చిం­ది.

ఓటర్ సవరణకు షెడ్యూల్

పం­చా­య­తీ­ల్లో ఓటరు జా­బి­తా మరో­సా­రి సవ­ర­ణ­కు రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం (ఎస్‌­ఈ­సీ) బు­ధ­వా­రం షె­డ్యూ­ల్ ప్ర­క­టిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ రోజు అంటే.. గు­రు­వా­రం నుం­చి నవం­బ­ర్ 23వ తేదీ వరకు గ్రా­మా­ల్లో ఓట­ర్ల జా­బి­తా­ల­ను సవ­రిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. 20వ తే­దీన ఓట­ర్ల దర­ఖా­స్తు­లు, అభ్యం­త­రాల స్వీ­క­రణ, తప్పుల సవరణ చే­య­నుం­ది. 21వ తే­దీన ఓట­ర్ల దర­ఖా­స్తు­లు, అభ్యం­త­రా­ల­ను పరి­ష్క­రి­స్తుం­ది. 23వ తే­దీన ఓట­ర్ల జా­బి­తా, పో­లిం­గ్ కేం­ద్రాల ప్ర­చు­రణ ఉం­టుం­ద­ని రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం బు­ధ­వా­రం జారీ చే­సిన ఉత్త­ర్వు­ల్లో స్ప­ష్టం చే­సిం­ది. ఈ మే­ర­కు జి­ల్లా పం­చా­య­తీ అధి­కా­రు­ల­కు రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్ (ఎస్ఈ­సీ) రాణి కు­ము­ది­ని ఆదే­శా­లు జారీ చే­సిన వి­ష­యం వి­ది­త­మే. దీం­తో తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ప్ర­క్రియ మరింత ఊపం­దు­కుం­ది.

ప్రజా పాలన వారోత్సవాల తర్వాతే...

డి­సెం­బ­ర్ 1 నుం­చి 9 వ తేదీ వరకు ప్ర­జా పాలన వా­రో­త్స­వా­లు జరు­గు­తా­యి. ఆ తర్వాత ఈ ఎన్ని­కల ని­ర్వ­హిం­చా­ల­ని ఇటీ­వల జరి­గిన కే­బి­నె­ట్ సమా­వే­శం­లో సీఎం రే­వం­త్ ని­ర్ణ­యిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. ఈ నే­ప­థ్యం­లో ఈ ప్ర­క్రి­య­పై రా­ష్ట్ర పం­చా­య­తీ రాజ్ శాఖ, రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం దృ­ష్టి సా­రిం­చా­యి. వచ్చే ఏడా­ది మా­ర్చి 31వ తేదీ లోపు పం­చా­య­తీ ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తే­నే.. కేం­ద్ర ఆర్థిక సంఘం నుం­చి ని­ధు­లు వి­డు­ద­ల­య్యే అవ­కా­శం ఉంది. తాజా క్యా­బి­నె­ట్ సమా­వే­శం­లో ము­ఖ్య­మం­త్రి ఏ. రే­వం­త్ రె­డ్డి "గ్రామ పం­చా­య­తీ­లు మా­త్ర­మే డి­సెం­బ­ర్‌­లో జరు­గు­తా­యి, MPTC/ZPTC­లు కో­ర్టు తీ­ర్పు తర్వాత" ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. పం­చా­య­తీ­ల­కు రా­వా­ల్సిన మూ­డు­వే­ల­కో­ట్ల ని­ధు­లు ఆగి­పో­కుం­డా పాత రి­జ­ర్వే­ష­న్ల­తో­నే ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని అను­కుం­టు­న్నా­రు. ప్ర­జా­పా­లన వా­రో­త్స­వా­లు తొ­మ్మి­దో తే­దీ­తో పూ­ర్త­వు­తా­యి.

Tags

Next Story