Mallikarjun Kharge : జులై 4న హైదరాబాద్ కు ఖర్గే

Mallikarjun Kharge : జులై 4న హైదరాబాద్ కు ఖర్గే
X

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర పర్యటన ఖరారైంది. వచ్చేనెల 4 న ఆయన హైదరాబాద్ రానున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సోమవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ నూతన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో ఖర్గే పాల్గొంటారని తెలిపారు. అంతేగాక బూత్ లెవల్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీనియమితులైన పార్టీ కార్యవర్గ బాధ్యుల సమావేశం నిర్వహించనున్నట్లు, ఈ సమావేశంలో దాదాపు 15 వేల మంది ప్రతినిధులు ఉంటారని చెప్పారు. పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులను హైదరాబాద్ తీసుకువచ్చి, తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇతర కమిటీ సభ్యులదేనని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ఎవరెవరికి ఏ జిల్లా బాధ్యతలు అప్పగించే విషయాన్ని బుధవారం తెలియజేస్తామని చెప్పారు.

Tags

Next Story