Kothagudem : కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల భారీ ర్యాలీ

Kothagudem : కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల భారీ ర్యాలీ
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్‌ల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన ఉద్యోగులు కొత్తగూడెం పోస్టాఫీసు సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు తెలంగాణా రాష్ట్రం లో న్యాయం జరుగుతుందని వేచి చూసామని… అయినా ఫలితం లేకుండా పోయిందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తక్షణమే పర్మినెంట్ చేయాలని కోరారు. కనీస వేతనాలు సైతం అమలు కావటం లేదని వాపోయారు. తమ డిమాండ్‌ల పరిష్కారం కోసం దశల వారి ఉద్యమం కొనసాగిస్తామని.. లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

Tags

Next Story