కాంగ్రెస్ సీనియర్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
By - Bhoopathi |17 Jun 2023 6:15 AM GMT
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత తొమ్మిదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై, కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు జగదీశ్ రెడ్డి. దశాబ్దాల పాలనలో జిల్లాకు వారు చేసిందేమీ లేదని వ్యక్తిగతానికి మాత్రం పుష్కలంగా చేసుకున్నారని విమర్శించారు. గత తొమ్మిది ఏళ్లలో జిల్లా అభివృద్ధికి.. నూటికి నూరశాతం BRS ప్రభుత్వం చేసింది అన్నారు. ఆనాడు కరెంటు కోతలు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు దర్శనం ఇస్తే నేడు 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయ వ్యాపార గృహ అవసరాలకు ఇస్తున్నామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com