Minister Ponguleti : తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ది పొంగులేటి

X
By - Manikanta |4 Nov 2024 5:00 PM IST
తెలంగాణలో రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్లో ఆలయ మాడ వీధులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామని చెప్పారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామని... వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రం అనుమతిస్తే మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com