Minister Ponnam : ఎలక్ట్రిక్ వాహనాలపై మంత్రి పొన్నం గుడ్ న్యూస్

X
By - Manikanta |18 Nov 2024 3:30 PM IST
తెలంగాణలోలో జీవో 41తో ఎలక్ట్రికల్ వాహనాలకు పరిమితి ఎత్తి వేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ బస్సు, కార్లు, టూ వీలర్స్ కు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. ఛార్జింగ్ స్టేషన్లకు ప్రత్యేకించి అనుమతులు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. యారీదారులే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. వాహన కాలుష్య కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఎత్తివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొనుగోలు దారులతో పాటు తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com