Uttam Kumar Reddy : ఛత్తీస్ గఢ్ కు మంత్రి ఉత్తమ్.. సమ్మక్క సారక్క ప్రాజెక్టు noc పై చర్చ

Uttam Kumar Reddy : ఛత్తీస్ గఢ్ కు మంత్రి ఉత్తమ్.. సమ్మక్క సారక్క ప్రాజెక్టు noc పై చర్చ
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

కాగా సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశం సెప్టెంబర్25 న నిర్వహిస్తామని ఐఎంవో ఆశిష్ బెనర్జీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు సంబంధించిన NOC చర్చించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛత్తీస్ ఘడ్ సీఎంవో నుంచి కబురు అందింది. ఈ నెల 19న ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కోరగా, నేడు సాయంత్రం 4 గంటలకు భేటీ ఖరారైంది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్ ఘడ్ కు వెళ్లనున్నారు.

Tags

Next Story