Bathula Lakshma Reddy : కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసి.. రైతుల కోసం రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే

Bathula Lakshma Reddy : కొడుకు రిసెప్షన్ క్యాన్సిల్ చేసి.. రైతుల కోసం రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే
X

మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు తమ నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం అరుదైన విరాళాన్ని ప్రకటించారు. రైతుల కోసం ఖర్చు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2 కోట్ల చెక్కును అందించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, తమ నియోజకవర్గంలో ఉన్న లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఇటీవల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేయాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే రిసెప్షన్‌ను రద్దు చేసుకుని, ఆ ఖర్చును రైతుల కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. రైతుల పట్ల ఎమ్మెల్యే చూపిన ఈ ఔదార్యాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. ఈ విరాళం రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని, సమాజానికి ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు.

Tags

Next Story