TG : లొట్ట పీసు కేసులు నిలబడవు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై పనికట్టుకుని కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో ఆరోపించారు. కేటీఆర్ పై ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో అక్రమ కేసు పెట్టారని అన్నారు. కారు రేసు విషయంలో అవినీతి ఎక్కడుందని ప్రశ్నించారు. రుణమాఫీ గురించి ప్రశ్నించినందుకు, తులం బంగారం ఇస్తామన్న దానిపై ప్రశ్నించినందుకు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశ్నించినందుకు కేసులు పెడుతున్నారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు ఒక లొట్టపీసు కేసు అని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ-రేసు కోసం వివిధ రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని... అలాంటి పోటీని తట్టుకుని కేటీఆర్ తెలంగాణకు తీసుకొస్తే... రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. టెస్లా కంపెనీని తెలంగాణకు తీసుకురావడమే కేటీఆర్ లక్ష్యమని... అందుకే కారు రేసును రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు. కరీంనగర్ కోర్టులో తన బెయిల్ షూరిటీలు సమర్పించారు కౌశిక్ రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com