TG : విగ్రహం వీడియో చూస్తే ఏడుపొచ్చింది.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

X
By - Manikanta |15 Oct 2024 8:15 AM IST
సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపిచ్చారు. హిందువులంతా ఏకమై అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయం విజువల్స్ చూస్తుంటే ఏడుపు వస్తుందన్నారు. ఇంత దారుణం జరిగినా సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
మసీదుపై దాడి జరిగితే ఒవైసీ బ్రదర్స్ ఏం చేసేవారో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారని రాకేష్ రెడ్డి విమర్శించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com