TG : ఎమ్మెల్సీ రేస్.. జోరుగా నామినషన్లు.. బరిలో బీఆర్ఎస్ నేతలు

X
By - Manikanta |4 Feb 2025 4:45 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. తొలిరోజు 10 నామినేషన్లు వచ్చాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఆరు నామినేషన్లు, మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మూడు, వరంగల్-కరీంనగర్-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు ఒక నామినేషన్ దాఖలైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లాల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుం టున్నారు. ఆర్మూర్ లో బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ టికెట్టు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com