TPCC Chief : ట్రంప్ మాటలకు మోదీ తోక ముడిచాడు ; మహేశ్ కుమార్ గౌడ్

TPCC Chief : ట్రంప్ మాటలకు మోదీ తోక ముడిచాడు ; మహేశ్ కుమార్ గౌడ్
X

ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ తో యుద్ధమని ప్రగల్భాలు పలికి ట్రంప్ చెప్పగా నే తోక ముడిచాడని, పాక్పై యుద్ధంలో దేశం ఏం సాధించిందో మోదీ చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్ గా పాల్గొని మాట్లాడారు... దేశ సమ గ్రత కు తూట్లు పొడిచే విధంగా ప్రధాని మోది, అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు. కులాల మీద, మతాల మీద రాజకీయాలు చేస్తూ, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నా రు. రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేండ్లలో దేశానికి ఏం చేశారని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ' అధికారమే పర మావధిగా.. అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిం చాం. 400 సీట్లు వస్తాయని నమ్మ బలికిన బీజేపీ నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పిన వారిలో మార్పు రాలేదు. ఖర్గే, రాహుల్ గాంధీ సూచన మేరకు ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీలకు కేబినెట్ లో పదవులు కట్టబెట్టాం. పీసీసీ కార్యవర్గంలో సైతం 70 శాతం మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి చోటు కల్పించి.. సామాజిక న్యాయానికి, మహిళలకు పెద్దపీట వేశాం. ఇట్లనే మిగితా పార్టీలు పదవులు ఇచ్చి మాట్లాడాలి. ' అని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు.

Tags

Next Story