Mancherial: మంచిర్యాలలో విషాదం.. విద్యుత్ షాక్తో తల్లీబిడ్డ మృతి..
By - Divya Reddy |31 Aug 2022 8:30 AM GMT
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలం బొప్పారంలో కరెంట్ షాక్తో తల్లీబిడ్డ మృత్యువాత పడ్డారు.
Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. కోటపల్లి మండలం బొప్పారంలో కరెంట్ షాక్తో తల్లీబిడ్డ మృత్యువాత పడ్డారు. పొలం పనులకోసం వెళ్తున్న కుటుంబసభ్యులకు.. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్వైర్ తగలటంతో తల్లీబిడ్డలు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఇద్దరిని కాపాడేప్రయత్నం చేసిన భర్తకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు.. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అప్పటికే మహిళతోపాటు చిన్నారి మృతిచెందారు. శవాలు సైతం గుర్తుపట్టకుండా మారిపోయాయి. అటు తీవ్రగాయాలైన సమ్మయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com