TG : లగచర్ల ఘటన బాధాకరం ఎంపీ డీకే అరుణ

కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా అధికారులపై జరిగిన దాడి ఘటన బాధాకరమని బీజేపీ సీనీయర్ నేత, మహబూబ్ నగర్ ఎంపీ డీ.కే.అరుణ అన్నారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇతర ఉన్నత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీ వద్దంటూ గత కొన్ని రోజులుగా స్థానికులు చాలా కోపంతో ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ లేకుండా అధికారులు గ్రామానికి వెళ్లారన్నారు. ఈ క్రమంలో స్థానికులు సహనం కోల్పోయి దాడులు చేసినట్లు తెలిసిందని, అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. స్థానికంగా ఉన్న 6 గ్రామాల రైతులు ఫార్మా కంపెనీని చాలా వ్యతిరేకిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆ గ్రామాల ప్రజల అభిప్రాయాలను గౌరవించి చర్చలకు పిలవాలన్నారు. పార్టీ సీనియర్లను క్షేత్రస్థాయికి పంపించి అసలేం జరిగిందో నిజానిజాలు తెలుసుకుంటామని ఎంపీ డీకే అరుణ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com