CM Revanth Reddy : నా సహచరులు విధిలేక బీఆర్ఎస్‌లో ఉన్నారు: సీఎం రేవంత్

CM Revanth Reddy : నా సహచరులు విధిలేక బీఆర్ఎస్‌లో ఉన్నారు: సీఎం రేవంత్
X

కొంతమంది నేతలు విధిలేక బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. ‘బీఆర్ఎస్‌లోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. బీఆర్ఎస్‌ వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.

మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్‌ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘ఆ జిల్లా మహిళలు గర్భం దాల్చేందుకూ భయపడుతున్నారు. మూసీ పునరుజ్జీవం వద్దని ప్రజలు చెబుతున్నారని బీఆర్ఎస్‌ అంటోంది. రండి.. కేటీఆర్ వస్తారో? హరీశ్ వస్తారో? నేను కూడా గన్‌మెన్లు లేకుండా వస్తా. నల్గొండ పోదామా? భువనగిరి పోదామా? ఆలేరు పోదామా? మూసీ పునరుజ్జీవం కావాలో, వద్దో అడుగుదాం?’ అని అన్నారు.

తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Tags

Next Story