Minister Pongulati : అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్గా పెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. పదేండ్లలో హౌసింగ్ సెక్టార్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని అన్నారు. ‘అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. పేద వాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలి. ఇటీవల ప్రభుత్వం చేపట్టింది సర్వే కాదు.. ఎలిజబులిటీ ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు.. పరిశీలన.. దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాలు నిజమా కాదా అనేది పూర్తి బాధ్యత అధికారులదే. నిరుపేద వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. పాత కాంట్రాక్టర్ అనుకూలంగా ఉంటే వాళ్ళతో నిర్మాణం చేపిద్దాం. లేదంటే లబ్ధిదారులను గుర్తించి వారు నిర్మాణం చేసుకుంట అంటే నిధులు మంజూరు చేస్తాం. లబ్ధి దారులను గుర్తించడంలో చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు. గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాలు గడిచినా లబ్ధి దారులకు నిధులు మంజూరు కాలేదు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. గ్రీన్ ఛానెల్ ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని’ మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com