MLA Kova Lakshmi : అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు : ఎమ్మెల్యే కోవా లక్ష్మి

అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానిం చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆమె ఇవాళ కలెక్టరేట్ ముందు బైఠాయించారు. తిర్యాణి, రెబ్బెన మండలాల్లో ఇటీవల పలు అభివృద్ధి కార్యక్ర మాల గురించి తనకు చెప్పలేదన్నారు. ఇందిర మ్మ ఇండ్ల భూమిపూజ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపకుండా డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ శంకుస్థాపన చేయించడం ఏమిటని ప్రశ్నించారు. తిర్యాణి మండలంలో కాంగ్రెస్ నాయకుడు అనిల్ గౌడ్తో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నార ని ఆరోపించారు. ఎంపీడీవో, హౌజింగ్ ఏఈ, ఇతర అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న ట్లు విమర్శించారు. ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కావడంతో తనను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. వెంటనే అక్కడి అధికారులను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నిరసిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కలెక్ట రేట్ ఎదుట బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలెక్టర్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని, అప్పటి వరకు కదిలేద ని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు, నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచి ప్రభుత్వాని కి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com