Telangana : ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభం ఎల్లుండికి వాయిదా

Telangana : ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభం ఎల్లుండికి వాయిదా
X

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభం ఎల్లుండికి వాయిదా పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, ముందస్తు షెడ్యూల్ (ఏప్రిల్ 1)ని రెండు రోజులు ముందుకు జరిపినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1కి బదులుగా 3న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం నాడు హైదరాబాద్, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్లో 13, వరంగల్ అర్బన్లో ఒక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానున్నాయి. రంగారెడ్డి డివిజన్లోని గండిపేట కొత్త ఎకై ్సజ్ పోలీస్ స్టేషను, సంగారెడ్డి పరిధిలో అమీన్పురా పోలీస్ స్టేషన్లను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లితో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ఎం రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఎ క్సైజ్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగిలిన ఎక్సైజ్ స్టేషన్లను ఆయా ప్రాంతాల్లోని అధికారులు ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2020లోనే 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి, వీటి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి, సిబ్బందిని సైతం కేటా యించింది. వీటి ప్రారంభానికి ఎన్నికల కోడ్ అడ్డంరావడం, ప్రభుత్వం మార డంతో 15నెలల సమయం పట్టింది. ప్రతీ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు.

Tags

Next Story