Hyderabad : చేతికి నల్ల బ్యాడ్జ్ తో ప్రార్థనలకు ఒవైసీ హాజరు

X
By - Manikanta |26 April 2025 12:15 PM IST
భారత్- పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు ధీటుగా బదులిస్తోంది భారత సైన్యం. ఇక ఇండియన్ ఆర్మీకి మద్దతుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినూత్న కార్యక్రమం చేపట్టారు. చేతికి నల్ల రిబ్బన్ కట్టుకుని శుక్రవారం ప్రార్ధనలకు వచ్చారు ఓవైసీ. అంతేకాదు స్వయంగా తానే ముస్లిం యువకులకు నల్లరిబ్బన్లు పంచి పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా నల్లబ్యాండ్లు కట్టుకుని నిరసన తెలిపినట్లు ఎంపీ అసద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను నల్లబ్యాడ్జీలు ధరించాలని అసద్ పిలుపిచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com