Pawan Kalyan : పటాన్​ చెరులో పవన్ కల్యాణ్​

Pawan Kalyan : పటాన్​ చెరులో పవన్ కల్యాణ్​
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వెళ్లారు. ఇక్రిశాట్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ను ఆయన సందర్శించారు. తన కుమారుడి అడ్మిషన్‌ కోసం పవన్‌ వెళ్లినట్లు సమాచారం. ఇటీవల సింగపూర్‌లో పవన్ కుమారుడు మార్క్‌ శంకర్‌ చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. తర్వాత సింగపూర్ కు వెళ్లిన పవన్ కల్యాణ్.. తన కొడుకును ఇండియాకు తీసుకొచ్చారు. మార్క్ శంకర్ ను ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో చేర్చించేందుకు పవన్ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్మిషన్‌ ను సంబంధించి వివరాలను సేకరించారని, సౌకర్యాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం.

Tags

Next Story