Yadadri : యాదాద్రి.. పార్కింగ్‌ ఫీజు గంటకు రూ.500

Yadadri : యాదాద్రి.. పార్కింగ్‌ ఫీజు గంటకు రూ.500
Yadadri : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది.

Yadadri : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే సొంత వాహనాల్లో నేరుగా కొండపైకి వెళ్లాలనుకునే వారికోసం తాజాగా అనుమతి ఇచ్చిన అధికారులు... పార్కింగ్ ఫీజు మాత్రం కళ్లుచెదిరేలా నిర్ణయించారు.

యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల పార్కింగ్‌ కోసం కొండపై ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు, వీఐపీలు,దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

తొలి గంటకు 500, ఆ తర్వాత నుంచి గంటకు 100 అని ప్రకటించడంతో భక్తులు అవాక్కవుతున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం కొండపై వాహనాల పార్కింగ్ బాదుడుపై మండిపడుతున్నారు. దైవ దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులను పార్కింగ్ పేరుతో నిలువుదోపిడీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులు మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటున్నారు. కొండపైన వాహనాల రద్దీని నిలువరించేందుకే భారీగా పార్కింగ్‌ ధర నిర్ణయించామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story