TG : మెడికల్ కాలేజీల్లో పీజీ వెబ్ ఆప్షన్లు ప్రారంభం

X
By - Manikanta |30 Dec 2024 1:15 PM IST
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, నిమ్స్ మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ మొదలైంది. ఈ నెల 29 నుంచి 31 వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. కన్వీనర్ కోటా సీట్ల ను భర్తీ చేయనున్నారు. అయితే మెడికోలకు కేటాయించే సీట్లు సుప్రీం కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొన్నది. ఇక వైద్యారోగ్యశాఖ లోని మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్కు 84 శాతం మంది హాజరైనట్లు బోర్డు వెల్లడించింది. ఈ ఎగ్జామ్ కు 24,268 మంది దరఖాస్తు చేసుకోగా, 20,600 మంది హాజరైనట్లు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com