Moneylenders : వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు

Moneylenders : వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు
X

ఆదిలాబాద్, ఉట్నూర్ సబ్ డివిజన్లలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వడ్డీ వ్యాపారుల ఇండ్లలో ఏక కాలంలో పోలీసులు దాడులు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోనే దాదాపు 10 టీమ్లతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. వారి నుంచి బాండు పేపర్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో వాటిలోని వివరాలను సేకరిస్తున్నారు. వడ్డీల పేరుతో మోసగించి ప్రజలను దోపిడీకి గురి చేస్తున్నట్లు గుర్తించిన వారిపై కేసులు నమోదు చేయటానికి కసరత్తు చేస్తున్నారు. ఈ దాడులన్నీ ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోనే కొనసాగాయి. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు మార్కెట్ యార్డు డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేసే హేమంత్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఇంద్రానగర్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు చేయగా ఆయన ఇంట్లో 20 చెక్కులు, 21 డాక్యుమెంట్లు, 27 ప్రామిసరీ వాటిని స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు నోట్లు, ఒక మార్టిగేజ్ పత్రం లభ్యమైంది, నమోదు చేశారు.

Tags

Next Story