CM KCRపై పొంగులేటి ఫైర్‌

CM KCRపై పొంగులేటి ఫైర్‌
మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి KCRపై మండిపడ్డారు

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి KCRపై మండిపడ్డారు. రైతులు రాష్ట్రలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీ కళ్లకు కనపడుతుందా అంటూ పరోక్షంగా ప్రశ్నించారు. రైతులు అన్నమో రామచంద్ర అంటూ కల్లాల్లో, మండుటెడ్లలో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో రైతు ఋణ మాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. గత ప్రభుత్వాలు రైతులకు సబ్సీడీ ఇచ్చి రైతులను ఆదుకున్నాయన్నారు.

కేవలం రైతులకు రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప, KCR రైతులకు చేసిందేమీ లేదన్నాను పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. కౌలు రైతులను ఆదుకున్న పరిస్ధితి లేదని విమర్శించారు. గొప్ప రైతును అని చెప్పుకునే KCR ఎన్నికల స్టంట్‌తో కాకుండా, రైతులను చిత్త శుద్ధితో ఆదుకోవాలన్నారు. గొప్పలు చెప్పుకోవడానికి ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్రంలో రైతు దినోత్సవం పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. 21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, రైతులకు పదివేలు పంట నష్ట పరిహారాన్ని అందించడం లేదని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story