Phone Tapping Case : హైదరాబాద్ లో ప్రభాకర్ రావు.. కీలక దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు

హైదరాబాద్ చేరుకున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ ఆఫీసులో ప్రభాకర్ రావు ఉన్నారు. లుకౌట్ నోటీసులు ఉండటంతో విచారణ అధికారులకు సమాచారం ఇచ్చారు. క్లియరెన్స్ రావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ మొదలైంది. 15 నెలల తర్వాత స్వదేశానికి వచ్చారు ప్రభాకర్ రావు.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కార్యాలయం అడ్రస్ మారింది. మాసబ్ ట్యాంక్ నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్కు సిట్ ఆఫీస్ మార్చారు. 2 నెలల పాటు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి సిట్ పనిచేసింది. ఇవాళ ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ ఆఫీస్ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఉదయం సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com