RG Kar Medical College : ఆర్జీ కర్ కాలేజీ ప్రిన్సిపాల్ కు లై డిటెక్టర్ టెస్ట్

హత్యాచార ఘటన కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ.. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరుపై దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధమున్న నలుగురు డాక్టర్లకు పాలీగ్రాఫ్ టెస్టు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార, హత్య ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న సందీప్ ఘోష్తోపాటు మరో నలుగురు డాక్టర్లను సీబీఐ విచారిస్తోంది. ఈ సమయంలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయనకు లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే న్యాయస్థానం అనుమతి పొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. వీరికి లై డిటెక్టర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com