Hyderabad : హైదరాబాద్ లో కొత్త బార్ల కోసం పుల్ డిమాండ్

హైదరాబాద్ విశ్వనగరంలో బార్లకు యమా క్రేజీ నెలకొంది. తెలంగాణలో ఉన్న జనాభాలో సగం జనాభా హైదరాబాద్లో ఉండగా ఇందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ జీహె చ్ఎంసీలోని 24 బార్లను పునరుద్ధరణకు దరఖాస్తులను ఆహ్వానించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లతోపాటు సరూర్ నగర్, జల్పల్లి, మహబూబ్ నగర్, నిజమాబాద్, బోధన్లో ఒక్కొక్క బార్కు దర ఖాస్తులను ఆహ్వానించింది. జీహెచ్ఎంసీలో 24 బార్లకు 359 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6 వరకు గడువు ఉంది.
జీహెచ్ఎంసీలో 24 బార్లకు మిగిలిన మూడు రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని అంచనా. ఇటీవలే రూరల్ లోని బార్లకు పిలిచిన బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర మిగిలిన జిల్లాలో 25 బార్లకు 1400 వందల మేర దరఖాస్తులు వచ్చాయి. రూరల్లో బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలోని బార్లకు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే అలోచనల తో ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ మూడు రోజుల్లో బార్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి నాంపల్లిలోని అబ్కారీ భవన్లో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో మూడు వేల నుంచి ఐదు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తులు తీసుకొ వడానికి నాంపల్లి కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com