TG : రాజీవ్ యువ వికాసానికి 14 వరకు గడువు పొడిగింపు

TG : రాజీవ్ యువ వికాసానికి 14 వరకు గడువు పొడిగింపు
X

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగ యువత తమ భవితను మార్చుకోవాలని బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య భట్టు కోరారు. ఈ పథకానికి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్జీబీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన యువత నుంచి 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏఏ ధృవీకరణ పత్రాలు అవసరమో ఆయన స్పష్టతనిచ్చారు. అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే ఆదా య ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ రెండు కార్డులు లేని వారు మీ సేవా ద్వారా ఆదాయ ధృవపత్రం నెంబర్ను సమర్పిం చాల్సి ఉం టుందని పేర్కొన్నారు. అదే విధంగా 2026 తర్వాత జారీ చేయబడిన కులధృవీ కరణ పత్రం ఉంటే సరిపోతుందని, కొత్తగా కుల ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యం కోసం మున్సిపల్ కార్యాల యాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఫారాలను అందు బాటులో ఉంచామని, వాటిని నింపి తిరిగి అక్కడే ఇవ్వాలని సూచించారు. దర ఖాస్తులకు చివరి తేదీని ఈ నెల 14 వరకు పొడిగించినట్లు మల్లయ్య భట్టు తెలియజేశారు.

Tags

Next Story