Telangana : రైతు భరోసా నిధులు విడుదల

X
By - Manikanta |17 Jun 2025 11:30 AM IST
రైతు నేస్తం వేదిక నుంచి సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆన్ లైన్ లో మీటనొక్కి రైతులు బ్యాంకు ఖాతాల్లో సీఎం నిధులు జమ చేశారు. 9రోజుల్లో 9వేలకోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని ప్రకటించారు. అంతకు ముందు 1034 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు చెప్పిన అనుభవాలను వ్యవసాయ విద్యార్థులు స్వయంగా వెళ్లి చూసి నేర్చుకోవాలని సూచించారు.
ఖమ్మం కు చెందిన రైతుల తో మాట్లాడుతున్న సందర్భంగా ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ ఖమ్మం జిల్లాకే ఇచ్చామని, ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయశాఖను ఇచ్చామని చమత్కరించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com