Laptops : ల్యాప్టాప్ దిగుమతులపై పరిమితి?

ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిలపై వచ్చే ఏడాది జనవరి తర్వాత కేంద్రం ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వెల్లడించింది. కాగా డెల్, ఏసర్, ఆపిల్, లెనోవో, హెచ్ పీ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇండియాలో ల్యాప్టాప్లను ఎక్కువగా విక్రయిస్తున్నాయి. అయితే ఇవన్నీ చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని సేల్ చేస్తున్నాయి. అయితే దిగుమతులపై ఆంక్షలు విధిస్తే ఈ కంపెనీలన్నీ భారత్ లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెంచుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్) దిగుమతులపై కేంద్రం పరిమితులు పెడితే సుమారు 84,000 కోట్లకు పైగా ఈ ఇండస్ట్రీపై ప్రభావం పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించాలనే ప్రతిపాదన ఇంతకుముందే వచ్చింది. అయితే అమెరికా కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆ ప్రతిపాదనను కేంద్రం విరమించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com