KTR : SLBC పై రేవంత్ బ్లేమ్ గేమ్ : కేటీఆర్

ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని, ప్రమాదం అంశంలో బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఆరోపించారు. చాలా కాలంపాటు ఆగిపోయిన పనులను జీఎస్ఐ, ఇంజినీరింగ్ నిపుణులు, సంస్థలతో సంప్రదింపులు జరప కుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రారంభించారన్నారు. పాతయంత్రాలను వినియోగిస్తున్నారని ఆరోపించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహానికి ఎనిమిది మంది కార్మికులు ప్రమాదంలో పడ్డారని అన్నారు. వాళ్లను రక్షించాల్సిన ముఖ్యమంత్రి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పారు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీప్ మినిస్టర్ గా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కి పాలన చేతగాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలను ఇతరుల పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆయనే అధికారంలో ఉన్నాననే విషయం మరచిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అన్ని కేసులపై దర్యాప్తులు చేసుకోవచ్చని అన్నారు. అలవి కాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం సాధ్యం కాకోవడంతో అటెన్షన్ డైవర్షన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. 15 నెలల నుంచి కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుపుతున్నారని అన్నారు. అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారన్నా రు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అసలు అవగాహనే లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com