Kishan Reddy : రేవంత్ దగా, మోసం...కిషన్ రెడ్డి కౌంటర్

Kishan Reddy : రేవంత్ దగా, మోసం...కిషన్ రెడ్డి కౌంటర్
X

రాష్ట్రంలో 14 నెలల కాంగ్రెస్ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ను రోడ్డున పడేస్తారా?. రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ కూడా చెల్లించకుండా మానసిక క్షోభకు గురిచే యడం ఎంత వరకు న్యాయం?. ఉద్యోగులకు రొటీన్ గా చెల్లించాల్సిన బిల్లుల్లో కూడా సీలింగ్ పెట్టడం సిగ్గుచేటు. నిజాయితీగా పనిచేసే ఉద్యో గులకు మీరు ఏ సందేశం ఇస్తున్నట్లు? ఏండ్ల తరబడి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో బకాయిలు చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యా లను మళ్లీ మభ్యపెట్టడం ఎంత వరకు కరెక్ట్? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మళ్లీ మోస పూరిత హామీలకు సిద్ధమవడం సిగ్గు చేటు. ని రుద్యోగ భృతి ఆశ చూపి 14 నెలలుగా రూ.56 వేల బకాయిపడి యువతను దగా చేశారు. మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా యుద్ధప్రాతి పదికన బకాయిలు విడుదల చేయండి. ఈరోజే రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్మును కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయండి. ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. దగా హామీలు, మోసపు మాటలతో మభ్యపెడితే మోసపోయేం దుకు గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్ష నర్ వర్గాలు సిద్ధంగా లేవు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ కిషన్ రెడ్డి హెచ్చరించారు.

Tags

Next Story