Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన డీసిఎం వ్యాన్.. నలుగురు చిన్నారులు మృతి..

X
By - Divya Reddy |5 March 2022 7:41 AM IST
Warangal: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Warangal: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం మండలం ఇచర్ల వద్ద అర్ధరాత్రి సమయంలో ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డ వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com