Minister Komatireddy : నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
X

వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కంప్లీట్ చేసి పనులు ప్రారంభిస్తామని, నాలుగేండ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ 'బీఆ ర్ఎస్ కు రోడ్లపై అవగాహన లేదు. ఉప్పల్ ప్లె ఓవర్ ను ఆరేండ్లు ఖాళీగా పెట్టారు. గత పాలకు లకు ఎంతసేపు పైసలు వచ్చే కాళేశ్వరం తప్ప రోడ్లను పట్టించుకోలేదు. కమీషన్ తీసుకుని కూలిపోయే కాళేశ్వరం కట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నాలుగు లైన్ల రోడ్లను ఆరు వందల కోట్లతో వేసుకున్నారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకు న్నారు. హరీశ్రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెల్వదు. నేను మాట్లాడుతుం డగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. రోడ్లు వేయడం చాతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు' అని మండిపడ్డారు.

Tags

Next Story