TG: బాలిక మృతి వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ హస్తం.. కొండా సురేఖ సంచలన ఆరోపణ

X
By - Manikanta |30 Nov 2024 1:45 PM IST
సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని చెప్పారు. విద్యార్థిని మృతిని రాజకీయం చేయడం దురదృష్టకరమన్న కొండా.. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసేవారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com