MP Raghunandan Rao : ఎంపీ రఘునందన్ కు భద్రత పెంపు

MP Raghunandan Rao  : ఎంపీ రఘునందన్ కు భద్రత పెంపు
X

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంచుతూ రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రఘునందను మధ్యప్రదేశ్ మావోయిస్టులను బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అధికారులు ఎంపీ రఘునందన్ రావుకు భద్రత అవ సరమని నిర్ధారణకు వచ్చారు. ఇకపై ఎంపీ రఘునందన్ పర్యటనలలో సాయుధ పోలీసులతో ఎస్కార్ట్ పెట్టాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టులు ఫోన్కు కాల్ చేసి బెదిరించిన వ్యవహారంపై వెంటనే అప్రమత్తమై రఘునందన్ రావును ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తనకు వచ్చిన ఫోన్ కాల్పై విచా రణ జరపడంతో పాటు తనకు సెక్యూరిటీ పెంచాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ పూర్తయిన నేపథ్యంలో సెక్యూరిటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

Tags

Next Story