Telangana High Court : ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు

Telangana High Court : ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు
X

బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఈటల దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం న్యాయ స్థానం కొట్టేసింది. ఘట్కేసర్లోని కొర్రెములలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్ చేయి చేసుకున్నట్లు అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో శ్రీహర్ష కన్స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఈటల హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఈ కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచిస్తూ పిటిషన్ ను కొట్టేసింది.

Tags

Next Story