TG : గ్లాండ్ ఫార్మా సీఈఓగా శ్యామకాంత్ గిరి

హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్యామకాంత్ గిరిని నియమించింది. ఈ విషయాన్ని కంపెనీ శనివారం అధికారంగా ప్రకటించింది. 2025 జనవరి 15వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు చేప్పట్టనున్నట్లు తెలిపింది. కాగా గిరి ప్రస్తుతం అమ్నీల్ ఫార్మాస్యూటికల్స్ లో ఇండియా బిజినెస్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్ కు అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇతనికి ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలోని భారత దేశానికి చెందిన వివిధ సంస్థలలో ఫార్మాస్యూటికల్స్, డివైజ్లు, డయాగ్నోస్టిక్స్,హెల్త్కేర్ సర్వీసెస్లో 25 సంవత్సరాలకు పైగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే కొంతకాలం పాటు రివారా ల్యాబ్స్లో సీఈఓగా పనిచేశారు. కాగా ప్రస్తుతం సంస్థ సీఈఓగా ఉన్న శ్రీనివాస్ సదు కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారని, కంపెనీ మలిదశ వృద్ధికి ఆయన ప్రణాళికలను అమలు చేస్తారని గ్లాండ్ ఫార్మా వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com