Telangana : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు

Telangana : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
X

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన మానసూన్ మహబూబ్ నగర్ నుంచి తెలం గాణలోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురు వనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు (27న) పశ్చిమ మధ్య బం గాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగు తున్న నేపథ్యంలో తెలంగాణలో ఇవాల్టి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కా మారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించా రు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటినుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 నుంచి కిమీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వాసలు పడే చాన్స్ ఉందని వివరించింది.

Tags

Next Story