Hydra : హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది.. ఉత్తర్వులు జారీ

హైడ్రాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా కమిషన్ కు ప్రభుత్వం మరింత భారీ భద్రతను ఏర్పాటు చేసింది. హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీస్ అధికారులను ప్రత్యేకంగా కేటాయించింది. అయితే గత ఆదివారం మాదాపూర్ పరిధిలోని సున్నపుచెరువు వద్ద అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేయగా.. పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం... హైడ్రా అధికారులకు మరింత భద్రత పెంచుతూ ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com