Yadadri: 108 మంది పారాయణీకులతో యాదాద్రి ఆలయంలో వైభవంగా పంచకుండాత్మక యాగం..

Yadadri: 108 మంది పారాయణీకులతో యాదాద్రి ఆలయంలో వైభవంగా పంచకుండాత్మక యాగం..
Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా ఇవాల్టి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభమైంది.

Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా ఇవాల్టి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభమైంది. మహాకుంభ సంప్రోక్షణకు పూర్వాంగంగా సోమవారం అంకురార్పణ చేశారు. స్వస్తి వాచనం ప్రారంభంతో పాటు విష్వక్షేణ పూజ సహా ఇతర క్రతువులు నిర్వహించారు. యాగశాల ప్రవేశం సహా కుంభస్థాపన చేశారు. వారం పాటు సాగనున్న పంచకుండాత్మక యాగ నిర్వహణకు బాలాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సంప్రోక్షణ చేపట్టి ఇప్పటికే గుండాలను సిద్ధం చేశారు.

నలువైపులా ఏర్పాటైన కుండాల మధ్య శ్రీ మహాలక్ష్మి నిర్వహించే యాగానికి పర్యవేక్షకులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. నిరంతర పారాయణ పఠనానికి 108 మంది పారాయణీకులను సిద్ధం చేశారు. సాయంత్రం జరిగే క్రతువుల్లో సామూహిక శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, నిత్య విశేష హోమాలు ఉంటాయి. బాలాలయంలో యాగంతో పాటు ప్రధానాలయంలో మూలమంత్ర జపాలు, పారాయణాలు కొనసాగుతాయి.

సోమవారం యాదాద్రి ఉద్ఘాటన ప్రక్రియ కన్నులపండువగా ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు యజ్ఞయాగాదులతో యాదాద్రి మారు మ్రోగనుంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఇవాళ పంచకుండాత్మక మహాయాగానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story