TG : కేటీఆర్ అడ్డాలో టీచర్ వేధింపులు.. రోడ్డెక్కిన గురుకుల అమ్మాయిలు

TG : కేటీఆర్ అడ్డాలో టీచర్ వేధింపులు.. రోడ్డెక్కిన గురుకుల అమ్మాయిలు
X

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినిలు ధర్నా చేపట్టారు. తమ పీటీ టీచర్‌ను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోయారు.

తమను కొడుతూ తమ వీడియోలు తీస్తూ పీటీ టీచర్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాత్‌ రూమ్‌లో స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసి చిత్ర హింసలకు గురిచేస్తోందని టీచర్‌ను సస్పెండ్‌ చయాలని కోరుతున్నారు విద్యార్థులు.

Tags

Next Story