Supreme Court: కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ఈ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ ను విచారించింది.
మూసీ ప్రక్షాళన పేరుతో 25 వేల కోట్ల స్కామ్ చేశారని కేటీఆర్ ఆరోపించగా ఆత్రం సుగుణ ఊట్నూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టు ను ఆశ్రయించగా ఎఫ్ఎస్ఐఆర్ ను క్వాష్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com