TG : మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై సర్వే

X
By - Manikanta |11 Feb 2025 3:45 PM IST
మాజీ మంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ భూమిలో సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి 12 ఎకరాలు కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా కోర్టులో యాదగిరి, సత్తెమ్మలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వర్సిటీలో భూ సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్లారు. వర్సిటీలో ఉన్న 12 ఎకరాల్లో సర్వే చేపట్టారు. మల్లారెడ్డికి వర్సిటీలో ఎంత భూమి ఉంది. ఎన్ని ఎకరాలు కబ్బా చేశారనే అంశాలపై అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com