Begumpet : బేగంపేట బస్తీల్లో తలసాని హల్చల్

X
By - Manikanta |30 Aug 2024 3:00 PM IST
హైదరాబాద్ బేగంపేటలో ప్రజల సమస్యలను అడిగి తలుసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్. ఉచిత కరెంట్ తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. జీరో విద్యుత్ బిల్లు, ఉచిత నీటి సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీపై ఆరా తీశారు. హామీని విస్మరించి బిల్లులు చెల్లించాలని అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ప్రభుత్వ తీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉచిత విద్యుత్కు అర్హులైన వారు బిల్లులు చెల్లించొద్దన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని MLA క్యాంప్ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు తలసాని.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com