అట్టహాసంగా..తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం

బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చ సందర్బంగా అట్టహాసంగా హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం లో తెలంగాణా ఉద్యమం లో కీలంగాణ పనిచేసిన నేతలు పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా విఠల్, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, రవీంద్రనాయక్, బూర నర్సయ్య గౌడ్, దేవయ్య, కొండా విశ్వేశ్వరెడ్డి తదితర నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి భాద్యతలు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలు ఉద్యమాం లో కీలకంగా పని చేసిన మాకు కూడా అవకాశం ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడంలేదని ఆవేదన చెందినట్లు తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com