TG : జూన్ 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చించే అవకాశం

జూన్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగ నుంది.సచివాలయంలో మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ బారతిపై చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభమైన రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న అర్జీలు.. తీసుకోవాల్సిన చర్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎరువులు, విత్తనాల సమస్యపైనా చర్చ జరగనుంది. అదే సమయంలో రైతు భరోసాకు సమకూర్చాల్సిన నిధుల గురించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. బనకచర్ల, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం పైనా డిస్కస్ చేస్తారని సమాచారం. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, విద్యా రంగ సమస్య లు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చిస్తారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com