TG: యమ"పాశం"

TG: యమపాశం
X
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ ప్రమాదంలె పెరుగుతున్న మృతుల సంఖ్య... ఇప్పటివరకూ 44 మంది దుర్మరణం..! పేలుడు ధాటికి 100 మీటర్లు ఎగిరిపడ్డ మృతదేహాలు

సం­గా­రె­డ్డి పాశ మై­లా­రం పా­రి­శ్రా­మి­క­వా­డ­లో భారీ అగ్ని­ప్ర­మా­దం సం­భ­విం­చిం­ది. సీ­గా­చి కె­మి­క­ల్స్ పరి­శ్ర­మ­లో భారీ పే­లు­డు జరి­గిం­ది. రి­యా­క్ట­ర్ పేలి మం­ట­లు ఎగి­సి­ప­డ్డా­యి. ఆ ప్రాం­త­మం­తా దట్ట­మైన పొ­గ­లు కమ్ము­కు­న్నా­యి. పే­లు­డు శబ్దం­తో కా­ర్మి­కు­లు భయం­తో పరు­గు­లు తీ­శా­రు. ఈ భారీ అగ్ని ప్ర­మా­దం­లో 44 మంది కా­ర్మి­కు­లు మర­ణిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. మృ­తుల సం­ఖ్య మరింత పె­రి­గే అవ­కా­శం ఉం­ద­ని వై­ద్యు­లు తె­లి­పా­రు. 35 మం­ది­కి పైగా కా­ర్మి­కు­ల­కు తీ­వ్రం­గా గా­య­ప­డి­న­ట్టు­గా తె­లి­సిం­ది. స్థా­ని­కుల సమా­చా­రం మే­ర­కు అగ్ని­మా­పక సి­బ్బం­ది సం­ఘ­ట­నా స్థ­లా­ని­కి చే­రు­కుం­ది. ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు.రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమైనట్టుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్, ఎస్పీ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కంపెనీలో 100మంది పని...

ఈ కం­పె­నీ­లో మె­డి­సి­న్స్ కి సం­బం­ధిం­చిన పౌ­డ­ర్ తయా­రు చే­స్తుం­టా­ర­ని స్థా­ని­కు­లు చె­బు­తు­న్నా­రు. వి­విధ రా­ష్ట్రా­ల­కు చెం­దిన కా­ర్మి­కు­లు ఇక్కడ పని­చే­స్తు­న్నా­ర­ని చె­బు­తు­న్నా­రు. కం­పె­నీ­లో దా­దా­పు 100 మంది వరకు పని­చే­స్తుం­టా­ర­ని స్థా­ని­కు­లు చె­బు­తు­న్నా­రు. కం­పె­నీ­లో పని­చే­స్తు­న్న తమ వా­ళ్ల­కు ఫో­న్లు చే­సి­నా లి­ఫ్ట్ చే­య­టం లే­ద­ని చె­బు­తు­న్నా­రు. ప్ర­మా­దం జరి­గి­న­ట్టు­గా తె­లి­సిం­ది. ఫ్యా­క్ట­రీ లోపల చి­క్కు­కు­న్న వారి కోసం వారి కు­టుంబ సభ్యు­లు, బం­ధు­వు­లు తీ­వ్ర భయాం­దో­ళన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. సం­ఘ­ట­నా స్థ­లా­న్ని మం­త్రు­లు దా­మో­దర రా­జ­న­ర్సింహ, వి­వే­క్‌ వెం­క­ట­స్వా­మి పరి­శీ­లిం­చా­రు. క్ష­త­గా­త్రు­ల­కు మె­రు­గైన వై­ద్య సా­యా­న్ని అం­దిం­చా­ల­ని జి­ల్లా కలె­క్ట­ర్‌­ను మం­త్రి దా­మో­దర రా­జ­న­ర్సింహ ఆదే­శిం­చా­రు.

Tags

Next Story